సెమీఫైనల్లో ఎస్బీహెచ్
ముంబై: ఆలిండియా పీఎస్యూ టి20 క్రికెట్ టోర్నమెంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో అనూప్ పాయ్ (61 బంతుల్లో 74) రాణించడంతో ఎస్బీహెచ్ జట్టు 25 పరుగుల తేడాతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జట్టుపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఎస్బీహెచ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనూప్ పాయ్ అర్ధసెంచరీ సాధించగా, డానీ డెరిక్ ప్రిన్స్ 49 పరుగులు చేశాడు.
ఆర్బీఐ బౌలర్ కమలేశ్ కుమార్ 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్బీఐ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులే చేయగలిగింది. చిరాగ్ పర్మార్ చేసిన 37 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్ కాగా... మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఎస్బీహెచ్ బౌలర్లు ఆకాశ్ భండారి, తిరుమలశెట్టి సుమన్ చెరో 2 వికెట్లు తీశారు. బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన అనూప్ పాయ్కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.