క్వార్టర్స్‌లో సానియా జంట

క్వార్టర్స్‌లో సానియా జంట


ఒహాయో: తన కొత్త భాగస్వామి షుయె పెంగ్‌ (చైనా)తో కలిసి భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సిన్సినాటి ఓపెన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ ఇండో–చైనా ద్వయం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 7–5, 6–4తో జూలియా జార్జెస్‌ (జర్మనీ)–ఓల్గా సావ్‌చుక్‌ (ఉక్రెయిన్‌) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఇరీనా కామెలియా బేగూ–రలూకా (రొమేనియా) జంటతో సానియా – షుయె పెంగ్‌ ద్వయం తలపడుతుంది.



పోరాడి ఓడిన రామ్‌కుమార్‌

మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత యువతార రామ్‌కుమార్‌ రామనాథన్‌ రెండో రౌండ్‌లో నిష్క్రమించాడు. ప్రపంచ 60వ ర్యాంకర్‌ జారెడ్‌ డొనాల్డ్‌సన్‌ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ 4–6, 6–2, 4–6తో పోరాడి ఓడిపోయాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ 12 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. రెండో రౌండ్‌లో వెనుదిరిగిన రామ్‌కుమార్‌కు 32,780 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 21 లక్షలు) తోపాటు 45 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top