సానియా జంటకే టైటిల్

సానియా జంటకే టైటిల్


హింగిస్‌తో కలిసి మరో ట్రోఫీ సొంతం

* ఇండో-స్విస్ జంటకు వరుసగా 40వ విజయం


సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా): వేదిక మారినా... ప్రత్యర్థి మారినా... ఫలితం మాత్రం మారలేదు. అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట తమ ఖాతాలో మరో టైటిల్‌ను జమచేసుకుంది. ఆదివారం ముగిసిన సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది.



ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 6-1తో వెరా దుషెవినా (రష్యా) -బార్బరా క్రెజ్‌సికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది.  సానియా-హింగిస్‌లకిది వరుసగా 40వ విజయం కావడం విశేషం. జతగా వీరిద్దరికిది 13వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది నాలుగోది.



ఈ సంవత్సరం సానియా-హింగిస్‌లు బ్రిస్బేన్ ఓపెన్, సిడ్నీ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జోడీకి 40,170 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 27 లక్షల 36 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 36వ, హింగిస్ కెరీర్‌లో 54వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top