క్వార్టర్స్‌లో సానియా జంట

క్వార్టర్స్‌లో సానియా జంట


మహిళల డబుల్స్ విభాగంలో సోమవారం జరిగిన మూడో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-4, 6-3తో అనాబెల్ మెదీన్ గారిగెస్-అరంటా సంటోంజా (స్పెయిన్) జోడీపై నెగ్గింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-హింగిస్ తమ ప్రత్యర్థి సర్వీస్‌ను తొలి సెట్‌లో మూడుసార్లు, రెండో సెట్‌లో రెండుసార్లు బ్రేక్ చేశారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయారు.

 

 పేస్ జోడీ ఓటమి: పురుషుల డబుల్స్  మూడో రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) ద్వయం 3-6, 5-7, 6-3, 6-2, 2-6తో పెయా (ఆస్ట్రియా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)-మెర్జియా (రుమేనియా) జంట 7-6 (7/4), 6-7 (5/7), 7-6 (7/5), 7-6 (10/8)తో కుబోట్ (పోలండ్)-మిర్నీ (బెలారస్) జోడీపై నెగ్గింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top