మరో టైటిల్ వేటలో..

మరో టైటిల్ వేటలో..


బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. చైనా ఓపెన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడి 6-2, 6-3 తేడాతో చెన్ లియాంగ్-యఫాన్ వాంగ్(చైనా) జోడీపై గెలిచి ఫైనల్ కు చేరింది.  వరుస సెట్లను కైవసం చేసుకున్న సానియా జోడి మరో టైటిల్ వేటకు సిద్ధమైంది.


 


ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ లతో సహా ఏడు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీ మరో టైటిల్ ను తమ ఖాతాలో వేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఈ టైటిల్ ను గెలిచినట్లయితే వరుసగా నాల్గో టైటిల్ ను సాధించిన అరుదైన ఘనతను సానియా -హింగిస్ ల జోడీ సొంతం చేసుకుంటుంది. గత మూడు టోర్నమెంట్లలో ప్రత్యర్థికి సానియా జోడీ ఒక్క సెట్ ను కూడా  కోల్పోకుండా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top