ఫైనల్లో సానియా జోడి

ఫైనల్లో సానియా జోడి


బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్ జోడి మరో టైటిల్‌కు చేరువయింది. చైనా ఓపెన్‌లో ఈ జోడి ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో సానియా-హింగిస్ 6-2, 6-3తో చైనా ద్వయం చెన్ లియాంగ్, యఫాన్ వాంగ్‌పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టాప్‌సీడ్ సానియా ద్వయం జోరుకు అన్‌సీడెడ్ ప్రత్యర్థులు ఎదురు నిలువలేకపోయారు.



తొలి సెట్‌లో నాలుగుసార్లు, రెండోసెట్‌లో ఒక్కసారి ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా జోడి ఈ ఏడాది ఇప్పటికే ఏడు టైటిల్స్ గెలిచింది. చైనా ఓపెన్ ఫైనల్లోనూ గెలిస్తే సానియా-హింగిస్ ద్వయం ఈ ఏడాది ఎనిమిదో టైటిల్ సొంతం చేసుకుంటారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top