సురేశ్ రైనా అవుట్!
ముంబై: న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి సురేశ్ రైనా అవుటయ్యాడు. గత మూడు వన్డేలకు వైరల్ ఫీవర్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన సురేశ్ రైనా.. మిగతా రెండు వన్డేలకు సైతం దూరం కానున్నాడు. తదుపరి రెండు వన్డేలకు గత జట్టునే కొనసాగించాలని నిర్ణయించడంతో రైనాకు నిరాశ తప్పలేదు. కివీస్ తో ఆడనున్న మిగతా రెండు వన్డేలకు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలియజేసింది.
గతేడాది అక్టోబర్లో ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో రైనా చివరిసారి ఆడాడు. ఆ తరువాత న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ముందు అతనికి పిలుపు వచ్చినా, జ్వరం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం రైనా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా, తుది జట్టులో మార్పులు చేయకూడదని భావించడమే అతనికి చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.