సాకేత్‌కు డబుల్స్ టైటిల్

సాకేత్‌కు డబుల్స్ టైటిల్


ఏటీపీ చాలెంజర్ టోర్నీ

 

పుణే: గతవారం కెరీర్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ వారం డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. శుక్రవారం జరిగిన పుణే ఏటీపీ చాలెంజర్ డబుల్స్ ఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-3, 6-2తో టాప్ సీడ్ సంచాయ్ రటివటానా-సొంచాట్ (థాయ్‌లాండ్) ద్వయ ంపై గెలిచింది. ఈ విజయంతో సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 89 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్‌లో ఇది మూడో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్.  సింగిల్స్‌లో సాకేత్ సెమీస్‌లో  6-7 (6/8), 4-6తో నాలుగో సీడ్ యూచి సుగిటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top