ఇండోర్ ఓపెన్ ఫైనల్లో సాకేత్

ఇండోర్ ఓపెన్ ఫైనల్లో సాకేత్


ఇండోర్: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని ఇండోర్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాకేత్ 6-2, 6-1తో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)పై గెలిచాడు. ఈ విజయంతో సాకేత్ తన కెరీర్‌లో తొలిసారి ఓ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు.



ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ 118వ ర్యాంకర్ అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)తో సాకేత్ తలపడతాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ-దివిజ్ శరణ్ (భారత్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో యూకీ-దివిజ్ ద్వయం 6-2, 4-6, 3-10తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)-మెనెన్‌దెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top