ఇండియన్ ఓపెన్ ఫైనల్స్లోకి దూసుకెళ్లిన సైనా


హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన ఉత్సాహంలో ఉన్న సైనా.. వరుస సెట్లలో జపాన్కు చెందిన ప్రత్యర్థి యుకి హషిమొటోను ఓడించింది. మొదటి సెట్ను అలవోగా 21-15తో గెలుచుకున్న సైనా, రెండో సెట్లో ప్రత్యర్థికి ఆమాత్రం అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ సెట్ను 21- 11 తేడాతో గెలుచుకుని నేరుగా ఫైనల్స్లోకి వెళ్లింది. ఈ మ్యాచ్ కేవలం 43 నిమిషాల్లోనే ముగిసింది. ఫైనల్స్లో ఆమె థాయ్లాండ్కు చెందిన ప్రపంచ నెంబర్ 3 ర్యాంకర్ ఇలనాన్ రచానోను ఢీకొంటుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top