సైనా నెహ్వాల్‌ మరోసారీ..

సైనా నెహ్వాల్‌ మరోసారీ..


న్యూఢిల్లీ: ఫామ్‌లేమితో సతమతమవుతున్న భారత ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ క్వార‍్టర్స్‌లో సైనా ఓటమి చవిచూసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా 21-12, 21-17 స్కోరుతో ఝంగ్‌ యిమన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. ఇటీవల జరిగిన హాంకాంగ్‌ ఓపెన్‌లో కూడా సైనా క‍్వార్టర్స్‌లోనే పోరాటం ముగించింది.



ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ జాబితాలో సైనా టాప్‌-10లో చోటు కోల్పోయి 11వ ర్యాంకుకు పడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్‌-10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top