సెమీస్ లో సైనా


వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ దూసుకుపోతోంది. శుక్రవారం ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షిజియాన్ వాంగ్ (చైనా)ను 21-16, 21-19తో ఓడించింది.



గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-14, 21-18తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నిచావోన్‌పై సైనాకిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top