ప్రపంచ కప్ 2015 అంబాసిడర్గా సచిన్

ప్రపంచ కప్ 2015 అంబాసిడర్గా సచిన్


దుబాయ్: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్నకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంబాసిడర్గా నియమితులయ్యాడు. సోమవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ మేరకు ప్రకటించింది.



వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచ కప్ అంబాసిడర్గా సచిన్ను వరుసగా రెండోసారి నియమించడం విశేషం. స్వదేశంలో జరిగిన గత ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి భారత్ జట్టులో సచిన్ ఉన్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్దే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top