'హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రాణం'

'హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రాణం' - Sakshi


హైదరాబాద్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ లో సందడి చేశాడు. ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా నగరానికి వచ్చిన సచిన్ జైపూర్ పింక్ పాంథర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.  తొలుత ఇన్ ఆర్బిట్ మాల్ స్మాష్ గేమింగ్ సెంటర్ ను సచిన్ ప్రారంభించాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన లిటిల్ మాస్టర్.. తనకు హైదరాబాద్ తో పాటు ఇక్కడి బిర్యానీ అంటే చాలా ఇష్టమన్నాడు. ఫలక్ నామ ప్యాలస్ నగరంలో అద్భుత కట్టడమని.. అలాంటి కట్టడాలు ఇప్పుడు కట్టడం అసాధ్యమన్నాడు. ఈ సందర్భంగా గతంలో ఫలక్ నామ ప్యాలెస్ లో రెండు రోజుల పాటు కుటుంబంతో గడిపిన క్షణాలను సచిన్ గుర్తుకు తెచ్చుకున్నాడు. తమ ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ టీమ్ కు హైదరాబాద్ బిర్యానీ తినిపించాలని అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజాలను కోరినట్లు సచిన్ తెలిపాడు. హైదరాబాద్ నగరం మంచి అభివృద్ధి చెందుతున్న నగరంగా సచిన్ పేర్కొన్నాడు.





 ప్రొ కబడ్డీ లీగ్ లో భాగంగా మంగళవారం ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోజైపూర్ పింక్ పాంథర్స్ - తెలుగు టైటాన్స్ ల మధ్య మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ కబడ్డీ టీమ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రముఖ హీరో అల్లు అర్జున్ మ్యాచ్ కు హాజరై ప్రేక్షకులను ఉత్సాహపరచనున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top