సచిన్కు శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం తన 42వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. తల్లి రజని, భార్య అంజలి, పిల్లల మధ్య మాస్టర్ బర్త్డే సంబరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అతనితో కలిసి ఆడిన ఆటగాళ్లు, ముంబై ఇండియన్స్ సహచరులు, మిత్రులు సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా మాస్టర్కు శుభాకాంక్షలు అందజేశారు.
క్రికెటర్లందరికీ ఆదర్శమైన వ్యక్తికి శుభాకాంక్షలు అంటూ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ట్వీట్ చేయగా, చాంపియన్ ఆటగాడంటూ కుంబ్లే అభినందించాడు. మరో వైపు బీసీసీఐ ‘హ్యాపీ బర్త్డే భారతరత్న’ అంటూ శుభాకాంక్షలు చెప్పింది.
సంబంధిత వార్తలు