రూపిందర్, ఉతప్పలకు ఉద్వాసన
హాకీ ప్రపంచ లీగ్ సెమీస్కు జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: హాకీ ప్రపంచ లీగ్ (హెచ్డబ్ల్యుఎల్) సెమీఫైనల్ కోసం ఎంపిక చేసిన భారత హాకీ జట్టులో నలుగురు ప్రధాన ఆటగాళ్లకు ఉద్వాసన పలికారు. డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్, మిడ్ఫీల్డర్ ఎస్కే ఉతప్ప, స్ట్రయికర్లు మన్దీప్ సింగ్, సత్బీర్ సింగ్లకు 16 మందితో కూడిన జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానంలో డిఫెండర్లు జస్జీత్ సింగ్ కులార్, గుర్మైల్ సిగ్, మిడ్ ఫీల్డర్ లలిత్ ఉపాధ్యాయ్, స్ట్రయికర్ యువరాజ్ వాల్మీకి ఎంపికయ్యారు. బెల్జియంలో వచ్చే నెల 20 నుంచి జూలై 5 వరకు జరిగే ఈ టోర్నీ లో పది దేశాలు తలపడతాయి. పూల్ ‘ఎ’లో భారత్ 20న ఫ్రాన్స్తో తొలి మ్యాచ్ ఆడుతుంది.