అశ్విన్, జడేజాలకు విశ్రాంతి

అశ్విన్, జడేజాలకు విశ్రాంతి


టి20 జట్టులో అమిత్‌మిశ్రా, రసూల్‌   



న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే టి20 సిరీస్‌ కోసం ఇంతకు ముందే ప్రకటించిన భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా, ఆల్‌రౌండర్‌ పర్వేజ్‌ రసూల్‌లను జట్టులోకి ఎంపిక చేశారు. భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో చర్చించిన తర్వాత సెలక్షన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.



జట్టులో ఇప్పటికే చహల్‌ రూపంలో మరో లెగ్‌స్పిన్నర్‌ ఉండగా, మిశ్రాను కూడా ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచినా, ఇంగ్లండ్‌తో ఒక్క మ్యాచ్‌లో కూడా మిశ్రాకు అవకాశం దక్కలేదు. కెరీర్‌లో 8 టి20లు ఆడి 14 వికెట్లు తీసిన అతను, ఈ ఫార్మాట్‌లో భారత్‌ ఆడిన ఆఖరి సిరీస్‌ (అమెరికాలో వెస్టిండీస్‌తో) లో కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నా డు. జమ్మూ కశ్మీర్‌ నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన రసూల్‌ టీమిం డియా తరఫున ఏకైక వన్డేను రెండున్నరేళ్ల క్రితం ఆడాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top