ఓపెనర్లను బౌల్డ్ చేసిన భజ్జీ
బెంగళూరు: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 210 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 48 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ గేల్(10) అవుటయ్యాడు. మరో ఓపెనర్ బిస్లా 20 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరినీ హర్భజన్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెంగళూరు 9 ఓవర్లలో 56/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. కోహ్లి(17), దినేష్ కార్తీక్(1) క్రీజ్ లో ఉన్నారు.