హైదరాబాద్ జట్టు కెప్టెన్గా రాయుడు
మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీకి జట్ల ప్రకటన
హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్తో హైదరాబాద్ క్రికెట్ జట్టు కొత్త సీజన్కు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 31 వరకు హైదరాబాద్లోనే ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో పాల్గొనే రెండు హైదరాబాద్ జట్లను హెచ్సీఏ ప్రకటించింది. హెచ్సీఏ ఎలెవన్ జట్టుకు అంబటి రాయుడు, హెచ్సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు అమోల్ షిండే కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
జట్ల వివరాలు: హెచ్సీఏ ఎలెవన్: ఏటీ రాయుడు (కెప్టెన్), సీవీ మిలింద్, అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, తిలక్ వర్మ, బి.సందీప్, ఆశిష్ రెడ్డి, ఆకాశ్ భండారి, మెహదీ హసన్, ఎండీ సిరాజ్, రవికిరణ్, కె.సుమంత్, ఎండీ ముదస్సిర్, సాకేత్ సాయిరామ్, భగత్ వర్మ.
హెచ్సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్: అమోల్ షిండే (కెప్టెన్), యతిన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, బి.రాహుల్, చందన్ సహాని, మీర్ జావీద్ అలీ, రోహిత్ రెడ్డి, నీరజ్ బిస్త్, ప్రణీత్ రెడ్డి, కార్తీక్, తనయ్ త్యాగరాజన్, సుదీప్ త్యాగి, హితేశ్ యాదవ్, ఒమర్ ఖాన్, ఎం. రాధాకృష్ణ, వంశీవర్ధన్ రెడ్డి.
సంబంధిత వార్తలు