రవిశాస్త్రి మాటలు జట్టులో సూర్తిని నింపాయి: రైనా

రవిశాస్త్రి మాటలు జట్టులో సూర్తిని నింపాయి: రైనా

కార్డిఫ్: టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి జట్టులో ఆత్మవిశ్వాసం నింపారని భారత జట్టు సభ్యుడు సురేశ్ రైనా అన్నారు. జట్టు సమావేశంలో రవిశాస్త్రి చెప్పిన కొన్ని మాటలు ఆటగాళ్లందరిలోఉత్సాహాన్ని సూర్తిని నింపాయని రైనా తెలిపారు. 

 

హోటల్ నుంచి స్టేడియం బస్సులో వెళ్తుండగా తన పక్కనే కూర్చుని.. ధీటైన ఆటను ప్రదర్శించాలి అని రవిశాస్త్రి చెప్పారని రైనా మీడియాకు వెల్లడించారు. రవిశాస్త్రి ఇచ్చిన సూర్తితోనే తాను సెంచరీ నమోదు చేశానన్నారు. 

 

ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ వన్డేలో రైనా 75 బంతుల్లో 100 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. జట్టు విజయం, తన రాణింపు వెనుక ఘనత రవిశాస్త్రిదేనని రైనా వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ సిరిస్ లో ఘోర పరాజయం తర్వాత రవిశాస్త్రిని జట్టు డైరెక్టర్ గా నియమించిన సంగతి తెలిసిందే. 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top