కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు!

కోచ్  పదవికి రవిశాస్త్రి దరఖాస్తు!


న్యూఢిల్లీ: భారత క్రికెట్  జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కోచ్ పదవికి కోసం దరఖాస్తు చేయనున్నారు. అటు రవిశాస్త్రితో పాటు,  అతనితో కలిసి గతంలో పని చేసిన సంజయ్ బంగర్,  భరత్ అరుణ్,  ఆర్ శ్రీధర్ల త్రయం కూడా జాతీయ కోచింగ్ పదవుల కోసం తిరిగి దరఖాస్తు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది.  ఈ మేరకు వారి కోచింగ్ పదవుల దరఖాస్తు విషయాన్ని బీసీసీఐ తాజాగా ధృవీకరించింది.


 


భారత క్రికెట్ జట్టుకు డైరెక్టర్ గా పనిచేసిన రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లు దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.  అయితే టీమిండియా ప్రధాన కోచ్ల కోసం ఇంకా ప్రకటన ఇవ్వలేదని, ఇచ్చిన వెంటనే వీరు దరఖాస్తు చేస్తారని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.





ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికైన తరువాత జట్టు కోచ్ పదవి కోసం ప్రకటనలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగిన సామర్థ్యం ఉన్నవారు జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాతే కోచ్ ను ఎంపిక చేపట్టనున్నట్లు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top