రాజస్థాన్ లక్ష్యం 157

రాజస్థాన్ లక్ష్యం 157


అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ 157 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్కు నిర్దేశించింది. ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.



చెన్నై జట్టులో డ్వెన్ బ్రావో (62 నాటౌట్), డ్వెన్ స్మిత్ (40), ధోనీ (31 నాటౌట్) రాణించారు. చెన్నై ఓ దశలో 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టాపార్డర్లో బ్రెండన్ మెకల్లమ్ (12), రైనా (4), డుప్లెసిస్ (1) విఫలమయ్యారు. ఈ సమయంలో బ్రావో, ధోనీ జట్టును ఆదుకున్నారు.  రాజస్థాన్లో అంకిత్ శర్మ, మోరిస్, తాంబె, ఫాల్కనర్ తలా వికెట్ తీశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top