రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం
కోల్కతా: ఐపీఎల్-8లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఆరంభం కావాల్సిన ఈ మ్యాచ్ ఇంకా మొదలుకాలేదు. వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు. ఈడెన్ గార్డెన్స్లో ఇంకా వర్షం పడుతోంది.
పాయింట్ల పట్టికలో రాజస్థాన్, కోల్కతా వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ టోర్నీలో రాజస్థాన్ ఏడు మ్యాచ్లాడగా ఐదింటిలో నెగ్గింది. కోల్కతా ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింటిలో గెలుపొందింది.