పంజాబ్ లక్ష్యం 151


మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి జరగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 151 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్కు నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది.



హైదరాబాద్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ 35 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో హాఫ్ సెంచరీ చేశాడు.  హెన్రిక్స్ 30, నమన్ ఓజా 28 పరుగులు చేశారు. చివర్లో ఆశీష్ రెడ్డి (8 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 22 నాటౌట్)  బ్యాట్ ఝుళిపించాడు. కాగా ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లు అక్షర్ పటేల్, మిచెల్ జాన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top