మరో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్
మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. 53 పరుగుల వద్ద ఓపెనర్ మురళీ విజయ్ (12) రనౌటయ్యాడు. అంతకుముందు పంజాబ్ కెప్టెన్ బెయిలీ (22).. హెన్రిక్స్ బౌలింగ్లో అవుటయ్యాడు. పంజాబ్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.