'బల్బీర్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి'


చండీగఢ్: హాకీ దిగ్గజ ఆటగాడు, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత బల్బీర్ సింగ్(సీనియర్)కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ లేఖ రాశారు.



ప్రపంచకప్ ఫైనల్లో ఐదు గోల్స్ కొట్టిన రికార్డు బల్బీర్ సింగ్ పేరిట ఉందని లేఖలో పేర్కొన్నారు. గిన్నీస్ బుక్ లో నమోదైన ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదని గుర్తుచేశారు. బల్బీర్ సింగ్ సాధించిన విజయాలు ఎనలేనివని, ఆయనకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలని ప్రధానికి రాసిన లేఖలో బాదల్ కోరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top