చెమటోడుస్తున్న టీమిండియా
కొలంబో: శ్రీలంకతో మూడో టెస్టులో భారత్ చెమటోడ్చుతోంది. టాపార్డర్లో చటేశ్వర్ పుజారా మినహా ఇతర బ్యాట్స్మెన్ నిరాశపరిచారు. మ్యాచ్ రెండో రోజు శనివారం లంచ్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకు 119 పరుగులు చేసింది. పుజారా (55) హాఫ్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు.
50/2 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆచితూచి ఆడింది. విరాట్ కోహ్లీ 18, రోహిత్ శర్మ 26 పరుగులకు అవుటయ్యారు. లంక బౌలర్లు దమ్మిక ప్రసాద్ రెండు, ప్రదీప్, మాథ్యూస్ చెరో వికెట్ తీశారు. తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.