పాక్-సఫారీ మ్యాచ్ కు అంతరాయం
ఆక్లాండ్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-బీలో శనివారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగింది. 37వ ఓవర్ లో వర్షం ప్రారంభంకావడంతో ఆటను నిలిపివేశారు. కాసేపటికి వర్షం తగ్గడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది.
అయితే మరోసారి వర్షం కురవడంలో 40.1 ఓవర్ లో మ్యాచ్ నిలిచిపోయింది. ఆట ఆగిపోయే సమయానికి పాకిస్థాన్ 197/5 స్కోరుతో ఆడుతోంది. మిస్బా(51), ఆఫ్రిది(11) క్రీజ్ లో ఉన్నారు.