ఢిల్లీలో పీపుల్స్ చాయిస్ ట్రోఫీ

ఢిల్లీలో పీపుల్స్ చాయిస్ ట్రోఫీ


న్యూఢిల్లీ: ఐసీసీ వార్షిక అవార్డుల్లో కీలకమైన ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డు ట్రోఫీని శుక్రవారం ఇక్కడ ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఓటింగ్ ద్వారా ఈ అవార్డును ఎంపిక చేస్తారు. పీపుల్స్ చాయిస్ అవార్డులో ఫ్యాన్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారని, వారికి చేరువయ్యేందుకే ట్రోఫీని ప్రదర్శనకు ఉంచినట్లు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హెడ్ (కార్పొరేట్ మార్కెటింగ్) సంజయ్ చిత్కారా వెల్లడించారు.



ఈ అవార్డు కోసం ఐదు దేశాలకు చెందిన క్రికెటర్లు మిచెల్ జాన్సన్, డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్, ఏంజెలో మాథ్యూస్, మహిళా క్రికెటర్ చార్లొట్ ఎడ్వర్డ్స్ పోటీ పడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top