బెంగాల్‌కు తొలి ఓటమి

బెంగాల్‌కు తొలి ఓటమి


* పట్నా పైరేట్స్ విజయం  

* ప్రొ కబడ్డీ లీగ్


కోల్‌కతా: వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీదున్న బెంగాల్ వారియర్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 36-31 తేడాతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. ప్రథమార్ధం వరకు పట్నాకు బెంగాల్ గట్టిపోటీనే ఇచ్చి పాయింట్ల పరంగా 15-15తో సమానంగా నిలిచింది. అయితే ఆ తర్వాత   పట్నా ఆటగాళ్ల ఆధిపత్యం ముందు బెంగాల్ నిలవలేకపోయింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 10 రైడ్ పాయింట్లు, సందీప్ నర్వాల్ 6 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగాల్ నుంచి నితిన్ తోమర్ 9, జంగ్ కున్ లీ 7 రైడ్ పాయింట్లు సాధించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top