బెంగాల్కు తొలి ఓటమి
* పట్నా పైరేట్స్ విజయం
* ప్రొ కబడ్డీ లీగ్
కోల్కతా: వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీదున్న బెంగాల్ వారియర్స్కు ప్రొ కబడ్డీ లీగ్లో తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 36-31 తేడాతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. ప్రథమార్ధం వరకు పట్నాకు బెంగాల్ గట్టిపోటీనే ఇచ్చి పాయింట్ల పరంగా 15-15తో సమానంగా నిలిచింది. అయితే ఆ తర్వాత పట్నా ఆటగాళ్ల ఆధిపత్యం ముందు బెంగాల్ నిలవలేకపోయింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 10 రైడ్ పాయింట్లు, సందీప్ నర్వాల్ 6 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగాల్ నుంచి నితిన్ తోమర్ 9, జంగ్ కున్ లీ 7 రైడ్ పాయింట్లు సాధించారు.