ప్రపంచ ఛాంపియన్గా అద్వానీ
బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. సింగపూర్ క్రీడాకారుడు గిల్క్రిస్ట్పై 6-2 తేడాతో గెలిచాడు. తాను ఏడో స్వర్గాన్ని అధిగమించానని ఈ సందర్భంగా అద్వానీ చెప్పాడు.
తన ఆశయం సగమే పూర్తయిందని, మరో ఫార్మాట్లో ఇంకా విజయం సాధించాలని అన్నాడు. మంచి వార్త కోసం అందరూ వేచి చూడాలని చెప్పాడు. అప్పుడే ఎవరూ అభినందనలు తెలపొద్దని కూడా అన్నాడు. ఇప్పటివరకు పంకజ్ అద్వానీ 150కి పైగా అంతర్జాతీయ ట్రోఫీలు వశమయ్యాయి.