పంకజ్ అద్వానీ సరికొత్త రికార్డు
లీడ్స్:టైమ్ ఫార్మాట్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్లో భారత స్టార్ పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 1928-893 పాయింట్ల తేడాతో రాబర్ట్ హాల్ (ఇంగ్లండ్)పై గెలిచాడు.ఆద్యంతం పై చేయి కనబరిచిన పంకజ్ ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి 12 వ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ తాజా టైటిల్ తో పంకజ్ మరో ఘనతను కూడా సాధించాడు.
మూడోసారి ఒకే ఏడాదిలో టైమ్ ఫార్మాట్, పాయింట్ల ఫార్మాట్ ప్రపంచ టైటిల్స్ సాధించిన తొలి ప్లేయర్గా సరికొత్త రికార్డు సాధించాడు. గతంలో పంకజ్ 2008, 2005లలో ఈ ఘనతను సాధించాడు.