పంకజ్ అద్వానీ సరికొత్త రికార్డు

పంకజ్ అద్వానీ సరికొత్త రికార్డు


లీడ్స్:టైమ్ ఫార్మాట్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ  విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం  బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 1928-893 పాయింట్ల తేడాతో రాబర్ట్ హాల్  (ఇంగ్లండ్)పై గెలిచాడు.ఆద్యంతం పై చేయి కనబరిచిన పంకజ్ ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి 12 వ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ తాజా టైటిల్ తో పంకజ్ మరో ఘనతను కూడా సాధించాడు.


 


మూడోసారి ఒకే ఏడాదిలో టైమ్ ఫార్మాట్, పాయింట్ల ఫార్మాట్ ప్రపంచ టైటిల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు సాధించాడు. గతంలో పంకజ్ 2008, 2005లలో ఈ ఘనతను సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top