ఫైనల్లో పంకజ్

ఫైనల్లో పంకజ్


లీడ్స్: టైమ్ ఫార్మాట్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచేందుకు భారత స్టార్ పంకజ్ అద్వానీ మరో విజయం దూరంలో ఉన్నాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ 1180-1175 పాయింట్ల తేడాతో డేవిడ్ కాసియర్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. ఫైనల్లో రాబర్ట్ హాల్ (ఇంగ్లండ్)తో పంకజ్ అమీతుమీ తేల్చుకుంటాడు.



రెండో సెమీఫైనల్లో రాబర్ట్ హాల్ 978-824తో బాలచంద్ర భాస్కర్ (భారత్)పై నెగ్గాడు. ఒకవేళ ఫైనల్లో పంకజ్ గెలిస్తే... మూడోసారి ఒకే ఏడాదిలో టైమ్ ఫార్మాట్, పాయింట్ల ఫార్మాట్ ప్రపంచ టైటిల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. గతంలో పంకజ్ 2008, 2005లలో ఈ ఘనతను సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top