భారత్‌తో సిరీస్‌కు పాక్ ప్రభుత్వం అనుమతి


కరాచీ: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. శ్రీలంకలో జరిగే ఈ మ్యాచ్‌ల్లో ఆడేందుకు అనుమతినివ్వడమే కాకుండా భద్రతాపరమైన చర్యలను సునిశితంగా గమనించాలని ప్రధాని నవాజ్ షరీఫ్ పీసీబీకి సూచించారు. అటు బీసీసీఐ కూడా ఇదే విషయంపై భారత ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసింది. మరోవైపు ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ సిరీస్‌లు జరగాలనే పాక్ కోరుకుంటుందని భారత్‌లోని ఆ దేశ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు.మరోవైపు బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి అభ్యర్ధన రాలేదని భారత హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో పాకిస్తాన్ ఆడాలంటే తమ అనుమతి అవసరమని, శ్రీలంకలో ఆడటానికి విదేశాంగ శాఖ అనుమతి ఉంటే చాలని పేర్కొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top