భారత్తో సిరీస్కు పాక్ ప్రభుత్వం అనుమతి
కరాచీ: భారత్తో ద్వైపాక్షిక సిరీస్కు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. శ్రీలంకలో జరిగే ఈ మ్యాచ్ల్లో ఆడేందుకు అనుమతినివ్వడమే కాకుండా భద్రతాపరమైన చర్యలను సునిశితంగా గమనించాలని ప్రధాని నవాజ్ షరీఫ్ పీసీబీకి సూచించారు. అటు బీసీసీఐ కూడా ఇదే విషయంపై భారత ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసింది. మరోవైపు ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ సిరీస్లు జరగాలనే పాక్ కోరుకుంటుందని భారత్లోని ఆ దేశ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు.మరోవైపు బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి అభ్యర్ధన రాలేదని భారత హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్లో పాకిస్తాన్ ఆడాలంటే తమ అనుమతి అవసరమని, శ్రీలంకలో ఆడటానికి విదేశాంగ శాఖ అనుమతి ఉంటే చాలని పేర్కొంది.