ముగ్గురు ఆటగాళ్లపై పాక్ కోచ్ ఫిర్యాదు
కరాచీ: ప్రపంచకప్ క్వార్టర్స్లోనే వెనుదిరిగిన పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనతో పాటు జట్టులోని ముగ్గురు ఆటగాళ్లపై ప్రధాన కోచ్ వకార్ యూనిస్ పీసీబీకి నివేదిక అందించినట్టు సమాచారం. అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్, ముహమ్మద్ హఫీజ్లపై ఆయన ఘాటుగా ఫిర్యాదు చేశారని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.
వీరిలో హఫీజ్ గాయంతో టోర్నీకి ముందే స్వదేశానికి వచ్చాడు. అటు వన్డే కెప్టెన్గా అజహర్ అలీని నియమించాలని కోచ్ వకార్ ఆ నివేదికలో సూచించారు. అయితే ఈ నివేదికపై పీసీబీ స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు పాక్ వన్డే కొత్త కెప్టెన్ ఎంపికతో పాటు జాతీయ సెలక్షన్ కమిటీ నియామకంపై శుక్రవారం పీసీబీ సమావేశం నిర్వహించింది.