వెస్టిండీస్‌పై పాకిస్తాన్ క్లీన్‌స్వీప్

వెస్టిండీస్‌పై పాకిస్తాన్ క్లీన్‌స్వీప్


అబుదాబి: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి ముగిసిన చివరి టి20లో పాక్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమద్ వసీమ్ (3/21) మళ్లీ రాణించాడు. ఈ సిరీస్‌లో అతను 9 వికెట్లు తీశాడు. మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. శామ్యూల్స్ (59 బంతుల్లో 42 నాటౌట్, 3 ఫోర్లు) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. షోయబ్ మాలిక్ (34 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. బాబర్ అజమ్ (27 నాటౌట్), లతీఫ్ (21) ఫర్వాలేదనిపించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి షార్జాలో జరుగుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top