రెండో పరుగు వద్దే 3 వికెట్లు

రెండో పరుగు వద్దే 3 వికెట్లు


లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్థాన్ ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లోపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లీష్ బౌలర్లు వోక్స్ రెండు, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టి పాక్ ఆటగాళ్లకు చెమటలు పట్టించారు.



వోక్స్.. పాక్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఓపెనర్ సమీ అస్లాంను అవుట్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత పాక్ పరుగు కూడా చేయకుండానే వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లో మార్క్ వుడ్ మరో ఓపెనర్ షర్జీల్ ఖాన్(0)ను బౌల్డ్ చేశాడు. వోక్స్ ఆ వెంటనే పాక్ కెప్టెన్ అజర్ అలీ(0)ని పెవిలియన్కు చేర్చి పాక్ను కష్టాల్లోకి నెట్టాడు. పాక్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top