పేస్ జోడీ ఓటమి


బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఇండోర్స్ ఏటీపీ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలండ్) జోడీ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. రెండో సీడ్ పోస్పిసిల్ (కెనడా)-జిమోనిచ్ (సెర్బియా) ద్వయం 6-7 (8/10), 7-5, 10-4తో పేస్ జంటను ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు తొలి రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడీ 3-6, 6-7 (4/7)తో మారిన్ ద్రగంజా (క్రొయేషియా)-హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్) జంట చేతిలో ఓటమి పాలైంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top