నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే

నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే


భారత్, శ్రీలంక సిరీస్ షెడ్యూల్ విడుదల



 న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2 నుంచి 16 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో రద్దయిన సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు శ్రీలంకతో జరిగే వన్డే కేటాయించిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టు ఈ నెల 30న ముంబైలో ఇండియా ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది.

 

 షెడ్యూల్ వివరాలు


 

 తొలి వన్డే       నవంబర్ 2    కటక్

 రెండో వన్డే     నవంబర్ 6    అహ్మదాబాద్

మూడో వన్డే   నవంబర్ 9    హైదరాబాద్

నాలుగో వన్డే  నవంబర్ 13    కోల్‌కతా                                                                                                                                       ఐదో వన్డే       నవంబర్ 16    రాంచీ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top