బ్యాడ్మింటన్ విజేత ఏవీ కాలేజి
ఎల్బీ స్టేడియుం: ఓయుూ ఇంటర్ కాలేజి పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ను ఏవీ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. సీబీఐటీ జట్టుకు రెండో స్థానం లభించగా, ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి జట్టు వుూడో స్థానంలో నిలిచింది. గండిపేట్లోని చైతన్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) కాలేజి గ్రౌండ్స్లో సోవువారం జరిగిన ఫైనల్లో ఏవీ కాలేజి జట్టు 2-0 స్కోరుతో సీబీఐటీ జట్టుపై విజయుం సాధించింది. పురుషుల సింగిల్స్లో భార్గవ్ 21-5, 21-14తో ఆదిత్యపై గెలిచాడు. రెండో సింగిల్స్లో ఆదిత్య కిరణ్ 21-18, 21-19తో సహర్ష్పై నెగ్గాడు.