లూక్ రోంచీ విధ్వంసం: శ్రీలంక లక్ష్యం 361

లూక్ రోంచీ విధ్వంసం: శ్రీలంక లక్ష్యం 361 - Sakshi


దున్ దిన్:మరోసారి న్యూజిలాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ లో తమకు  తిరుగులేదని నిరూపించింది.   టాప్ ఆర్డర్ ఆటగాళ్లు విఫలమైన వేళ లూక్ రోంచీ లంక బౌలర్లను ఊచకోతకోశాడు. 99 బంతులను ఎదుర్కొన్న రోంచీ 14 ఫోర్లు, 6 సిక్సర్ల  సాయంతో 170 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు.  అతనికి జతగా  గ్రాంట్ ఏలియాట్ 104 పరుగులతో ఆకట్టుకుని చివరి వరకూ క్రీజ్ లో ఉన్నాడు.


 


దీంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది.  కివీస్ ఆటగాళ్లలో మెక్ గుప్తిల్ (0), మెక్ కలమ్ (25), విలియమ్స్(26), టేలర్(20) పరుగులు మాత్రమే చేశారు.   అంతకుముందు జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. తొలి వన్డేలో కివీస్ గెలవగా, రెండో వన్డేలో లంకేయులు విజయం సాధించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top