మురళీ విజయ్‌ అవుట్‌

మురళీ విజయ్‌ అవుట్‌ - Sakshi


కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 159/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ నాలుగో రోజు ఆదివారం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించింది. ఆరంభంలో మురళీ విజయ్‌, పుజారా నిలకడగా ఆడారు. కాగా మురళీ విజయ్ (76)‌.. శాన్ట్‌నర్‌ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. పుజారా (64) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 191/2.



తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 318 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ 262 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఓవరాల్‌గా 247 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top