పరుగుల ఖాతా తెరవకనే విజయ్ అవుట్
పుణె: ఐపీఎల్-8 లో భాగంగా శనివారం రాత్రి ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ బ్యాటింగ్కు దిగింది. పంజాబ్ పరుగుల ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్.. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో డకౌటయ్యాడు. వీరేంద్ర సెహ్వాగ్, వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్ చేస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.