అమెరికాలో ధోనీ పూజలు
అమెరికాలో టీమిండియా వన్డే కెప్టెన్ ఎం ఎస్ ధోనీ పూజలు నిర్వహించాడు. టీమిండియాకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ధోనీ ఎన్ఆర్ఐలను కోరాడు. తమది మంచి జట్టని.. ప్రస్తుతం టీమ్ ఎన్నో మార్పులకు లోనైందని, జట్టులోని యువకులు ఎంతో ప్రతిభావంతులని ధోనీ అన్నాడు. అభిమానుల మద్దతు ఉంటే ఎన్నో అధ్భుత విజయాలు సాధ్యమని తెలిపాడు. ఇక్కడి సిద్ది వినాయ ఆలయంలో భార్య సాక్షితో ధోనీ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.