మరో రికార్డును బ్రేక్ చేసిన ధోని

మరో రికార్డును బ్రేక్ చేసిన ధోని


ఫ్లోరిడా: ఇప్పటికే భారత తరపున మోస్ట్ సక్సెస్ఫఫుల్ కెప్టెన్గా ఖ్యాతిగాంచిన మహేంద్ర సింగ్ ధోని.. తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ 20 ద్వారా అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా చేసిన ఘనతను సాధించాడు. శనివారం జరిగిన విండీస్ మ్యాచ్తో అత్యధికంగా 325 అంతర్జాతీయ మ్యాచ్లకు (అన్ని ఫార్మాట్లలో) సారథ్యం వహించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న 324 మ్యాచ్ల రికార్డు చెరిగిపోయింది.ఇదిలా ఉండగా, విండీస్తో తొలి టీ 20తో అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక మ్యాచ్లకు(71) కెప్టెన్గా చేసిన వికెట్ కీపర్ ఘనతను కూడా ధోని సొంతం చేసుకున్నాడు.





ఇప్పటికే ధోని ఖాతాలో ఎన్నో రికార్డులున్న సంగతి తెలిసిందే. 2007లో టీ 20 వరల్డ్ కప్ అందించిన ధోని.. 2011లో వన్డే వరల్డ్ కప్ను సాధించి రెండు వరల్డ్ కప్లను సాధించిన ఏకైక భారత కెప్టెన్ గా నిలిచాడు. దీంతో పాటు ధోని తన అంతర్జాతీయ కెరీర్లో  194 వన్డేలకు కెప్టెన్గా చేసి 107 విజయాలను కైవసం చేసుకున్నాడు.  దీంతో వన్డేల్లో వందకు పైగా విజయాలను సాధించిన మూడో కెప్టెన్గా ధోని గుర్తింపు పొందాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top