మొయిన్ అలీ భారీ శతకం
చెస్టర్ లీ స్ట్రీట్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ(155 నాటౌట్;207 బంతుల్లో 17 ఫోర్లు, 2సిక్సర్లు) భారీ శతకం సాధించాడు. దీంతో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 132.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 498 పరుగులు నమోదు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది.. 310/6 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్కు మొయిన్ అలీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో భారీ స్కోరు సాధించింది.
అతనికి జతగా వోక్స్(39) చక్కటి సహకారం అందించాడు. అనంతరం స్టువర్ట్ బ్రాడ్(7), స్టీవ్ ఫిన్(10) నిరాపరిచినా అలీ సుదీర్ఘమైన ఇన్నింగ్స్తో నాటౌట్ గా క్రీజ్ లో నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ నాలుగు వికెట్లు సాధించగా, సిరివర్ధనే, లక్మాల్కు తలో వికెట్ దక్కింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.