స్కేటింగ్లో మెరిసిన రుద్రాన్ష్, కృష్ణ
సనత్నగర్: స్కేటింగ్ పోటీల్లో అమీర్పేట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చిన్నారులు రుద్రాన్ష్ పాండే, కృష్ణ మెరిశారు. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీల్లో అండర్-11లో రుద్రాన్ష్పాండే స్వర్ణం, రజతం గెలిచాడు. అండర్-14లో కృష్ణ రజతం, కాంస్యం చేజిక్కించుకున్నాడు. వీరి సహచరులు యశ్వంత్, శివతేజలు కూడా సత్తాచాటారు. అండర్-14 విభాగంలోనే శివతేజ రెండు స్వర్ణాలు, యశ్వంత్ రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ఈ నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు కోచ్ పవన్కుమార్ తెలిపారు. విజేతలను జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్రాజ్, అసిస్టెంట్ డెరైక్టర్ ఫ్రాన్సిస్ అభినందించారు.