‘రిలే’ స్వర్ణంతో ముగించారు


బ్యాంకాక్‌: ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను భారత్‌ స్వర్ణంతో ముగించింది. పోటీల చివరి రోజు భారత్‌కు స్వర్ణం, రజతం, కాంస్యం లభించాయి. స్ప్రింట్‌ మెడ్లే రిలేలో గుర్విందర్‌ సింగ్, పలేందర్‌ కుమార్, మనీశ్, అక్షయ్‌ నైన్‌లతో కూడిన భారత బృందం ఒక నిమిషం 55.62 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని దక్కించుకుంది. బాలుర జావెలిన్‌ త్రోలో రోహిత్‌ యాదవ్‌ (74.30 మీటర్లు) రజతం నెగ్గగా... అవినాశ్‌ యాదవ్‌ (70.09 మీటర్లు) కాంస్యం సాధించాడు. ఓవరాల్‌గా ఈ మీట్‌లో భారత్‌ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. చైనా (16 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు) 30 పతకాలతో అగ్రస్థానాన్ని సంపాదించగా... చైనీస్‌ తైపీ (6 స్వర్ణాలు, 7 రజతాలు, 2 కాంస్యాలు) 15 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top