మ్యాక్స్వెల్ కూడా బాధపడుతున్నాడట!
బెంగళూరు : ఈసారి ఐపీఎల్లో రాణించలేకపోతున్నందుకు ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ చాలా బాధపడుతున్నాడని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ బెయిలీ చెప్పాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ‘మ్యాక్స్ చాలా నిరాశలో ఉన్నాడు. అతను అద్భుతమైన ఆటగాడు. అయితే కొన్నిసార్లు అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోవచ్చు.
ఆసీస్తో పోలిస్తే భారత్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటిని అనుకూలంగా మల్చుకోలేకపోతున్నాడు. బయటి దేశాల్లో ఆడేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. మ్యాక్స్పై కూడా ఒత్తిడి అధికంగా ఉంది. అయినప్పటికీ రాబోయే మ్యాచ్ల్లో అతను సత్తా చాటుతాడు’ అని బెయిలీ వ్యాఖ్యానించాడు.