పుణెరి, పట్నా మ్యాచ్ టై
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో పుణెరి పల్టన్, పట్నా పైరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్ 30-30 స్కోరుతో టైగా ముగిసింది. ప్రథమార్ధంలో పట్నా మెరుగ్గా ఆడి ఆధిక్యం సాధించింది. అంతేకాకుండా చివరి మూడు నిమిషాల వరకు కూడా 30-28తో ఇక విజయం ఖాయమే అనే దశలో ఉంది, అయితే చివర్లో పుణెరి తరఫున అజయ్ ఠాకూర్ (7 పాయింట్లు) రెండు పాయింట్లు సాధించడంతో స్కోరు సమమైంది. పట్నా నుంచి ఆల్రౌండర్ పర్దీప్ నర్వాల్ 14 పాయింట్లు సాధించాడు.