పుణెరి, పట్నా మ్యాచ్ టై


 కోల్‌కతా:   ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణెరి పల్టన్, పట్నా పైరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్ 30-30 స్కోరుతో టైగా ముగిసింది. ప్రథమార్ధంలో పట్నా మెరుగ్గా ఆడి ఆధిక్యం సాధించింది. అంతేకాకుండా చివరి మూడు నిమిషాల వరకు కూడా 30-28తో ఇక విజయం ఖాయమే అనే దశలో ఉంది, అయితే చివర్లో పుణెరి తరఫున అజయ్ ఠాకూర్ (7 పాయింట్లు) రెండు పాయింట్లు సాధించడంతో స్కోరు సమమైంది. పట్నా నుంచి ఆల్‌రౌండర్ పర్‌దీప్ నర్వాల్ 14 పాయింట్లు సాధించాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top